PVL | చెన్నై: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడిన బ్లాక్హాక్స్ సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై మెటియర్స్పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో బ్లాక్హాక్స్ 7-15, 12-15, 15-10, 15-11, 20-18తో ముంబైని చిత్తు చేసింది.
ఐదు సెట్ల పాటు సాగిన పోరులో తొలుత ముంబై 2-0తో మందంజ వేసినా..బ్లాక్హాక్స్ సంచలన ప్రదర్శనతో వరుసగా మూడు సెట్లను కైవసం చేసుకుని మ్యాచ్లో విజేతగా నిలిచింది. అష్మతుల్లా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కైవసం చేసుకున్నాడు.