బెంగళూరు: వన్డే ప్రపంచకప్లో భాగంగా టీమ్ఇండియా తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆదివారం నెదర్లాండ్స్తో తలపడనున్నా.. ఆటగాళ్లంతా నాకౌట్ను దృష్టిలో పెట్టుకొనే సాధన కొనసాగిస్తున్నారు. డచ్ జట్టుతో పోరు కోసం బెంగళూరు చేరుకున్న రోహిత్ సేన శుక్రవారం నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్తో తలపడటం ఖాయమే కావడంతో.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లెఫ్టార్మ్ స్పిన్ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాడు. ఏమాత్రం ఉదాసీనతకు తావివ్వకుండా విరాట్ నెట్స్లో షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొంటూ కనిపించాడు.
కివీస్ ప్రధాన పేసర్ లూకీ ఫెర్గూసన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు కోహ్లీ ప్రత్యేకంగా సాధన చేశాడు. శార్దూల్ ఠాకూర్తో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్లతో బౌన్సర్లు వేయించుకొని బాగా ప్రాక్టీస్ చేశాడు. ఇక లెఫ్టార్మ్ స్పిన్నర్ల ఎదుట ఇటీవలి కాలంలో తడబడుతున్న కోహ్లీ.. కేశవ్ మహారాజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. శుక్రవారం ఐచ్ఛిక సాధన కాగా.. ఇషాన్ కిషన్ తప్ప భారత ఆటగాళ్లంతా నెట్స్లో శ్రమించారు.