Cricket World Cup | న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ఫైనల్ పిచ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. అహ్మదాబాద్ వేదికగా గత నెల 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో కంగారూలు విజేతగా నిలిచి ఆరోసారి కప్పు కైవసం చేసుకోగా.. ఆ మ్యాచ్ జరిగిన పిచ్ను ఐసీసీ యావరేజ్గా ప్రకటించింది.
ఫైనల్ ఆడిన గ్రౌండ్ ఔట్ ఫీల్డ్ చాలా బాగుందని పేర్కొన్న ఐసీసీ.. లీగ్దశలో భారత్ ఆడిన తొమ్మిది మ్యాచ్ల పిచ్లను కూడా యావరేజ్గానే ప్రకటించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్కు వినియోగించిన వాంఖడే పిచ్కు ఐసీసీ ‘గుడ్’రేటింగ్ ఇచ్చింది