హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ స్థాయి టోర్నీల్లో రాష్ట్ర ప్లేయర్ల జోరు కొనసాగుతున్నది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న జాతీయ అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో యువ స్ప్రింటర్ నిత్య గందె కాంస్య పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 100మీటర్ల రేసును 11.90 సెకన్లలో ముగించిన నిత్య మూడో స్థానంలో నిలిచింది. తరన్జీత్ కౌర్(ఢిల్లీ, 11.54సె), ధనేశ్వరి(కర్నాటక, 11.66సె) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.