న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన టీమ్ ఇండియా.. కొత్త డబ్ల్యూటీసీ సర్కిల్ని వచ్చే నెలలో ప్రారంభించనుంది. భారత జట్టు జూలై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా టీమ్ ఇండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది.
దీనికి సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. జూలై 12 నుంచి 16 వరకు తొలి టెస్టు, 20 నుంచి 24 మధ్య రెండో టెస్టు ఆడనుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 3 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. కాగా.. ఈ పర్యటనకు యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలని బోర్డు యోచిస్తున్నది.