పారిస్: ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ప్లేయర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నీ లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన భారత్ తాజాగా రికర్వ్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకం ఖాయం చేశారు. గురువారం జరిగిన సెమీస్ పోరులో దీపికా కుమారి, అంకితా భక్త్, సిమ్రన్జీత్కౌర్తో కూడిన భారత త్రయం 5-3 తేడాతో టర్కీపై అద్భుత విజయం సాధించింది.
అంతకుముందు జరిగిన పోరులో ఉక్రెయిన్పై 5-1తో, క్వార్టర్స్లో బ్రిటన్పై 6-0తో మనోళ్లు ఏకపక్ష విజయాలు సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగే పసిడి పతక పోరులో చైనాతైపీతో భారత ఆర్చర్లు తలపడుతారు. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సెమీస్లోకి ప్రవేశించింది. టోర్నీలో పురుషుల పోరాటం ముగిసింది.