న్యూఢిల్లీ: జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో సమీర్, రాజ్కన్వర్ సింగ్, జతిన్తో కూడిన భారత జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది.
టోర్నీ తుదిపోరులో భారత్ 1722 పాయింట్లు సాధించగా.. 1728 పాయింట్లతో కొరియా స్వర్ణం కైవసం చేసుకుంది. 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సమీర్ రజతం, మహేశ్ కాంస్యం గెలచుకున్నారు.