హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్) చాలెంజర్ టోఫ్రీలో భారత అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఢాకాలో జరిగిన పోటీల్లో భారత్ సహా మొత్తం నాలుగు దేశాలు పోటీపడ్డాయి.
బాలికల జూనియర్ విభాగం ఫైనల్లో భారత్ 48-17తో ఆతిథ్య బంగ్లాదేశ్పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకోగా, యూత్ కేటగిరీ తుదిపోరులో భారత్ 43-46తో బంగ్లా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. సత్తాచాటిన అమ్మాయిలను జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావు అభినందించారు. రెండేండ్లుగా తాము పడుతున్న కష్టానికి ఇది ప్రతిఫలమని పేర్కొన్నారు.