భువనేశ్వర్: మంగళవారం జరుగనున్న ఆసియా క్వాలిఫయర్స్ రెండో రౌండ్ మ్యాచ్లో భారత ఫుట్బాల్ జట్టు ఖతార్ను ఎదుర్కోనుంది. నాలుగేండ్ల క్రితం ‘డ్రా’గా ముగించిన మ్యాచ్ స్ఫూర్తితో విజయం సాధించాలన్న పట్టుదలతో భారత్ బరిలోకి దిగనుంది.
ఆసియా చాంపియన్ అయిన ఖతార్ ఫేవరెట్గా బరిలోకి దిగనున్నప్పటికీ గురువారం కువైట్ జట్టుపై విజయంతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఖతార్ 61 ర్యాంక్లో, భారత్ 102 ర్యాంక్లో కొనసాగుతున్నాయి.