హైదరాబాద్, ఆట ప్రతినిధి: విజయవాడ వేదికగా ఈ నెల 26వ తేదీ నుంచి మొదలయ్యే మహిళల అండర్-23 వన్డే టోర్నీ కోసం శనివారం హైదరాబాద్ జట్టును ఎంపిక చేశారు. త్రిష పూజిత కెప్టెన్గా, ప్రణవి చంద్ర వైస్ కెప్టెన్గా మొత్తం 13 మందితో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) టీమ్ను ప్రకటించింది. జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న గొంగడి త్రిష, మమత జట్టులో చోటు నిలుపుకున్నారు.