ముల్తాన్: విధ్వంసకర ఆటతీరుతో విజృంభిస్తున్న ఇంగ్లండ్ జట్టు.. మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్థాన్పై సిరీస్ విజయం సాధించింది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో గెలిచి.. మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. 355 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 328 రన్స్కు ఆలౌటైంది. షకీల్ (94), ఇమామ్ (60) పోరాడినా ఫలితం లేకపోయింది.