మస్కట్: తొలి మ్యాచ్లో చక్కటి విజయంతో ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో శుభారంభం చేసిన భారత జట్టు.. రెండో మ్యాచ్లో ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 0-2తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జపాన్ చేతిలో ఓడింది. పూల్-‘ఎ’లో భాగంగా జరిగిన పోరులో భారత్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా.. జపాన్ తరఫున నాగ యూరి (2వ ని.లో), సాకీ తనకా (42వ ని.లో) చెరో గోల్ చేశారు. టోర్నీ తొలి మ్యాచ్లో మలేషియాపై భారీ విజయం (9-0) సాధించిన భారత్.. రెండో మ్యాచ్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. సోమవారం జరుగనున్న చివరి లీగ్ మ్యాచ్లో సింగపూర్తో భారత్ తలపడనుంది.