Corporate Badminton League | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా నేటి నుంచి రెండు రోజుల పాటు కార్పొరేట్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జరుగనుంది. ప్రముఖ స్పోర్ట్స్ సర్వీస్ ప్రొవైడర్ గేమ్ పాయింట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో వివిధ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉద్యోగులు పోటీపడబోతున్నారు.
నిత్యం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక, శారీరక ఆరోగ్యం కోసం టోర్నీ ఏర్పాటు చేసినట్లు నిర్వహకుడు సిద్దార్థ్రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఉద్యోగులను ఒకతాటిపైకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.