ముంబై: ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ అడిడాస్తో భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వచ్చే నెల నుంచి భారత జట్టు వినియోగించే కిట్లను అడిడాస్ అందించనుంది. ప్రస్తుతం ‘కిల్లర్ జీన్స్’ బీసీసీఐ కిట్ స్పాన్సర్గా వ్యవహరిస్తుండగా.. ఈ నెల 31తో ఆ ఒప్పందం ముగియనుంది.
ఈ నేపథ్యంలో అడిడాస్తో చర్చలు సఫలమయ్యాయని బోర్డు కార్యదర్శి జై షా సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. కాగా.. ప్రస్తతం భారత జట్ల జెర్సీని బైజూస్ స్పాన్సర్ చేస్తుండగా.. ఆ ఒప్పందం కూడా ఈ ఏడాది అక్టోబర్తో ముగియనుంది.