మెల్బోర్న్: భారత్లో భారత్పై టెస్టు సిరీస్ గెలిచేందుకు ఆస్ట్రేలియా జట్టు నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 9 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్కు ఆస్ట్రేలియా కొత్తగా టాడ్ మర్ఫీని జట్టులోకి తీసుకుంది. అతనితో పాటు ఆస్టన్ అగర్, మిచెల్ స్వెప్సన్, నాథన్ లియాన్ జట్టుకు ఎంపికయ్యారు. 2004 తరువాత భారత్లో ఆసీస్ సిరీస్ నెగ్గలేదు. ఈసారి ఎలాగైనా సిరీస్ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది. తొలి టెస్టు నాగపూర్(ఫిబ్రవరి 9-13)లో, రెండో టెస్టు ఢిల్లీ(ఫిబ్రవరి 17-21)లో, మూడో టెస్టు ధర్మశాల(మార్చి 1-5)లో, నాలుగో టెస్టు అహ్మదాబాద్(మార్చి 9-13)లో జరుగనున్నాయి.
ఆస్ట్రేలియా: కమిన్స్(కెప్టెన్), ఆస్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, పీటర్ హ్యాండ్స్కాంబ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫి, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.