హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు సన్నాహకంగా జరుగుతున్న టోర్నీలో బుధవారం అసలుసిసలైన పోటీలు మొదలయ్యాయి. హుస్సేన్సాగర్ అలలపై తెరచాటు పడవలను నడుపుతూ సెయిలర్లు కనువిందు చేస్తున్నారు.
గాలి గమనానికి అనుగుణంగా పడవలను నడుపుతూ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించారు. పురుషుల ఐఎల్సీఏ 6 విభాగంలో ఏవైఎన్ క్లబ్ తరఫున కోటేశ్వర్రావు బరిలోకి దిగాడు. మహిళల ఐఎల్సీఏ 6 కేటగిరీలో ఎన్ఎస్ఎస్ సెయిలర్ రితికా పోటీ పడింది. వివిధ విభాగాల్లో సెయిలర్లు గెలుపు కోసం తుదికంటా ప్రయత్నించారు.