ముంబై: వచ్చే యేడాది ఐపీఎల్ సీజన్ కోసం ఈ యేడాది డిసెంబర్ 16న వేలం నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. 2023 ఐపీఎల్ మ్యాచ్లు పూర్వంలా ఇంటా బయటా పద్ధతిలో నిర్వహించనున్నారు. టోర్నీలో పాల్గొనే 10 జట్లు తమకు కేటాయించిన హోమ్ గ్రౌండ్తోపాటు ఇతర జట్ల హోంగ్రౌండ్లో తలపడతాయని గత నెలలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపిన విషయం తెలిసిందే. ఈసారి తక్కువమంది ఆటగాళ్లే వేలంలో పాల్గొనే అవకాశముంది. గత యేడాది రూ.90 కోట్లు శాలరీ పర్స్గా నిర్ణయించగా, ఈసారి దానిని రూ.95 కోట్లకు పెంచారు.