కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీలో వీరు బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్లో ఏడో సీడ్గా బరిలోకి దిగుతున్న సింధు.. తొలి రౌండ్లో పోర్న్పవీ చొచువాంగ్తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ నిలకడ కొనసాగించాలని చూస్తుంటే.. సాయిప్రణీత్, సమీర్వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.