బ్యాంకాక్: పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జంట థాయ్లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం ఆరో సీడ్ గాయత్రి-త్రిసా జోడీ 16-21, 21-10, 21-18తో లాక్ లూయి-వింగ్ యాంగ్ (హాంకాంగ్) ద్వయంపై విజయం సాధించింది.
గంట 14 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన భారత జోడీ.. ఆ తర్వాత విజృంభించి మ్యాచ్ను కైవసం చేసుకుంది. రెండో రౌండ్లో భారత్కే చెందిన అశ్విని పొన్నప్ప-తనీషా ద్వయంతో గాయత్రి జంట తలపడనుంది. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ, శంకర్ ముత్తుస్వామి మెయిన్”డ్రా’కు అర్హత సాధించారు.