టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టెస్టు జట్టు సారధ్య బాధ్యతలను వదులుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. దీంతో టెస్టుల్లో తర్వాతి సారధి ఎవరు? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
ఈ సమస్యపై మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. కోహ్లీ అర్ధంతరంగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కాబట్టి.. వన్డే, టీ20 కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకు టెస్టు జట్టు పగ్గాలు కూడా అందిస్తే సరిపోతుందని సంజయ్ అభిప్రాయపడ్డాడు.
‘‘టెస్టు క్రికెట్ ఇప్పటికీ పవిత్రమైంది. ఇలాంటి సమయంలో నేరుగా పంత్ లేదా కేఎల్ రాహుల్కు సారధ్య బాధ్యతలను టీమ్ మేనేజ్మెంట్ అందిస్తుందని నేననుకోవడం లేదు. రోహిత్ శర్మకు పగ్గాలు అందుతాయి. ఎందుకంటే ఇది చాలా సడెన్గా జరిగిపోయింది’’ అని మంజ్రేకర్ చెప్పాడు.
సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ అనూహ్యంగా.. తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.