రోమ్: టెన్నిస్ స్టార్ సుమీత్ నాగల్.. భారత క్రీడా చరిత్రలో గుర్తుండిపోయే విజయం సాధించాడు. యూరోపియన్ క్లే కోర్టులో ఏటీపీ చాలెంజర్ టైటిల్ నెగ్గిన తొలి భారత టెన్నిస్ ప్లేయర్గా నాగల్ రికార్డుల్లోకెక్కాడు.
రోమ్ వేదికగా జరిగిన ఏటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాగల్ 6-3, 6-2తో తనకంటే మెరుగైన ర్యాంక్ ఆటగాడు జెస్పర్ డి జాంగ్ను చిత్తుచేశాడు. నాగల్ కెరీర్లో ఇది మూడో ఏటీపీ చాలెంజర్ టైటిల్ కావడం విశేషం.