పుణె : అవిధూత్ పాటిల్ సుదీర్ఘ డిఫెన్స్తో గుజరాత్ జెయింట్స్తో జరిగిన అల్టిమేట్ ఖోఖో పోటీలో తెలుగు యోధాస్ 88-21 స్కోరుతో ఘనవిజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఆద్యంతం తెలుగు యోథాస్ ఆధిపత్యం ప్రదర్శించింది. అవిధూత్ పాటిల్ 6 నిమిషాల పాటు డిఫెన్స్ ఆడి జట్టుకు ఎనిమిది బోనస్ పాయింట్లు సాధించిపెట్టాడు.