కటక్: అల్టిమేట్ ఖోఖో లీగ్లో తెలుగు యోధాస్ వరుస విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్లో యోధాస్ 40-22తో ముంబై ఖిలాడీస్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆద్యంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన యోధాస్..ఈ సీజన్లో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. యోధాస్ తరఫున ప్రతీక్ వైకర్, అవదూత్ పాటిల్, ఆదిత్య మెరుగైన ప్రదర్శన కనబరిచారు.