పుణే: అల్టిమేట్ ఖోఖో లీగ్లో తెలుగు యోధాస్ జట్టు బోణీ కొట్టింది. ఆదివారం అట్టహాసంగా లీగ్కు అంకురార్పణ జరుగగా.. తెలుగు యోధాస్ ఆడిన మొదటి మ్యాచ్లో 10 పాయింట్ల తేడాతో చెన్నై క్విక్ గన్స్పై విజయం సాధించింది. తెలుగు టీమ్ 48 పాయింట్లు సాధించగా.. చెన్నై 38 పాయింట్లకు పరిమితమైంది.
ఛత్రపతి శివాజి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన పోరులో తెలుగు యోధాస్ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. అంతకుముందు పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ క్రీడకు హుంగులద్దగా.. అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మరో మ్యాచ్లో గుజరాత్ 25 పాయింట్ల తేడాతో ముంబై ఖిలాడీస్పై గెలుపొందింది.