పుణె: అల్టిమేట్ ఖోఖో లీగ్లో తెలుగు యోధాస్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మ్యాచ్లో యోధాస్ 83-45 తేడాతో రాజస్థాన్ వారియర్స్పై భారీ విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో యోధాస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయంతో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో 9 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. మ్యాచ్ విషయానికొస్తే..యోధాస్ తరఫున సచిన్ భార్గో, అరుణ్ గుంకి 11 పాయింట్లతో విజృంభించగా, రాకెన్సింగ్ 10 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. గత మ్యాచ్ ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు జట్టు తొలి ఇన్నింగ్స్లో 44 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ తరఫున మజహర్ (13) టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో ఒడిశా జాగర్నెట్స్ 50-47తో గుజరాత్ జెయింట్స్పై గెలిచింది.