హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో ఓటమి. సోమవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో టైటాన్స్ 30-37తేడాతో హర్యానా స్టీలర్స్ చేతిలో ఓటమిపాలైంది.
గత మ్యాచ్లో యూపీ యోధాస్ను ఓడించిన టైటాన్స్ అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. రైడింగ్లో టైటాన్స్ 16 పాయింట్లు సాధిస్తే.. హర్యానా 16 పాయింట్లతో సమంగా నిలిచింది. కానీ డిఫెన్స్లో టైటాన్స్ 7 పాయింట్లకు పరిమితం కాగా, హర్యానా 18 పాయింట్లు సొంతం చేసుకుంది. 15 మ్యాచ్లాడిన టైటాన్స్కు ఇది 13వ ఓటమి.