అహ్మదాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నది. బుధవారం పట్నా పైరేట్స్తో జరిగిన పోరులో టైటాన్స్ 28-50 స్కోరుతో పరాజయంపాలైంది. పైరేట్స్ జట్టులో సచిన్ అత్యధికంగా 14 పాయింట్లు సాధించగా, టైటాన్స్కు పవన్ షెరావత్ 11 పాయింట్లు సాధించాడు. ఆరంభంలో టైటాన్స్ పోటీ ఇచ్చినా మ్యాచ్ సాగేకొద్ది పైరేట్స్ ఆధిక్యం కనబరిచింది. ఏకపక్షంగా సాగిన మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 57-27తో హర్యానా స్టీలర్స్ను చిత్తుగా ఓడించింది. యోధాస్ జట్టులో సురేందర్ గిల్ 13, ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో జట్టు విజయానికి దోహదం చేశారు. స్టీలర్స్ జట్టులో మోహిత్ నందల్(5), వినయ్(5) సమంగా అత్యధిక పాయింట్లు సాధించారు.