బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో బోణీ కోసం ఎదురుచూస్తున్న తెలుగు టైటాన్స్కు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటి వరకు లీగ్లో 8 మ్యాచ్లాడిన టైటాన్స్ ఆరో పరాజయం మూటగట్టుకుంది. మంగళవారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 22-40 తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓడింది. టైటాన్స్ తరఫున రజనీశ్ (12 పాయింట్లు) ఒంటరి పోరాటం చేయగా.. గుజరాత్ తరఫున రాకేశ్ (16 పాయింట్లు) టాప్స్కోరర్గా నిలిచాడు. మరో మ్యాచ్లో పట్నా పైరెట్స్ 43-23తో యు ముంబాపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్కు దూసుకెళ్లింది.