హైదరాబాద్ : యూపీలో జరగనున్న అండర్ 23 నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో తలపడే మహిళల, పురుషుల టీంలను తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రకటించింది. ఫ్రీ స్టైల్ మహిళల టీంకు బల్లె రాజేశ్వరి (50 కిలోల విభాగం), బీనా (53 కిలోలు), సుంకు కారుణ్య (57 కిలోలు), ఎన్ అనూష (59), షేర్ ఇబ్రహిం (62), భూసారపు వినయని (65), వల్లెపు సింధుజ (68), సాధు హిమబిందు (72), షేక్ నేహ (76) ఎంపికయ్యారు.
ఇక పురుషుల జట్టులో పున్నం కళ్యాణ్ (55 కిలోల విభాగం), గడ్డం మహేందర్ (60), జల్లి రాజు (63), జాదవ్ చరణ్ (67), షేక్ అధర్ (72), జీవన్ చౌదరి రోహిత్ సింగ్ (77), హరీష్ కుమార్ (82), నిఖిల్ (87), కేవల్ యాదవ్ (97), చెరుకు జశ్వంత్ గౌడ్ (130) ఎంపికయ్యారు. గ్రెకో రోమన్ పురుషుల జట్టుకు కిషోర్ (57 కిలోల విభాగం), బి విశాల్ (61), షేక్ అబ్ధుల్ జునైద్ (65), అల్లం వెంకట ప్రసాద్ (74), కసబ్ వినోద్ (79), ముస్తఫా బిన్ సలాం (86), షేక్ ముస్తఫా బిన్ అలీం (92), మహ్మద్ అర్బాజ్ ఖాన్ ఫైజల్ (125) ఎంపికయ్యారు.