హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి ఐటీఎఫ్ టోర్నీల్లో జోరు కొనసాగిస్తున్నాడు. ఈజిప్టు వేదికగా జరిగిన 15కే టోర్నీ పురుషుల డబుల్స్లో ప్రజ్వల్ దేవ్తో కలిసి సాయి కార్తీక్ టైటిల్ చేజిక్కించుకున్నాడు.
శనివారం జరిగిన ఫైనల్లో సాయి కార్తీక్-ప్రజ్వల్ జంట 5-7, 7-6 (7/5), 10-8తో స్లొవేనియా జోడీపై విజయం సాధించింది. రెండు గంటలకు పైగా సాగిన తుదిపోరులో భారత ద్వయం అద్వితీయ ప్రదర్శన కనబర్చింది. తొలి సెట్ కోల్పోయిన అనంతరం వరుసగా రెండు సెట్లు నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది.