హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీలంక వేదికగా జరిగిన కామన్వెల్త్ చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన మద్దుకూరి రితేశ్ రజత పతకంతో మెరిశాడు. బాలుర అండర్-10 విభాగంలో బరిలోకి దిగిన రితేశ్ టోర్నీలో రెండో స్థానంలో నిలిచాడు. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన పోరులో ఆరు విజయాలు, ఒక డ్రా చేసుకున్న ఈ యువ ప్లేయర్ 6.5 పాయింట్లు సొంతం చేసుకున్నాడు.