హైదరాబాద్: కొలంబియా వేదికగా వచ్చే నెల 1 నుంచి మొదలవుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీ కోసం రాష్ట్ర యువ అథ్లెట్ నందిని గురువారం బయల్దేరి వెళ్లింది. ఈ సందర్భంగా ఎస్సీ గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రాస్..నందినిని అభినందించారు. మెగాటోర్నీలో పతకం సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ తరఫున నందిని, ఆంధ్ర నుంచి రజిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు.