హైదరాబాద్, ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరుగుతున్న జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ పతక జోరు కనబరుస్తున్నది. పోటీలకు రెండో రోజైన సోమవారం జరిగిన పురుషుల జూనియర్ 10కి.మీ స్క్రాచ్ రేసులో ఆశీర్వాద్ సక్సేనా రజత పతకంతో మెరిశాడు. అదే జోరు కొనసాగిస్తూ జూనియర్ టీమ్ స్ప్రింట్ ఈవెంట్లో రాష్ర్టానికి చెందిన ఆశీర్వాద్, రామకృష్ణ, సాయిరామ్ త్రయానికి కాంస్య పతకం దక్కింది. సబ్ జూనియర్ టీమ్ స్ప్రింట్ విభాగంలో శ్రీకాంత్, సాయిచరణ్యాదవ్, కౌశిక్ కాంస్య పతకం దక్కించుకున్నారు. అంతర్జాతీయ సైక్లిస్ట్ ఆశీర్వాద్తో పాటు పలువురు యువ సైక్లిస్టులు ఖేలో ఇండియా స్కీమ్ కింద గత రెండేండ్లుగా సాట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. టోర్నీలో తెలంగాణకు మరిన్ని పతకాలు వస్తాయని సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.