న్యూఢిల్లీ: తెలంగాణ యువ కెరటం గొంగడి త్రిష.. మహిళల ఎమర్జింగ్ ఆసియాకప్లో బరిలోకి దిగే భారత్-‘ఎ’ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 12 నుంచి హాంకాంగ్ వేదికగా జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ శుక్రవారం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్కు శ్వేత సారథ్యం వహించనుంది.
అండర్-19 స్థాయిలో మెరుపులు మెరిపించి దేశానికి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన త్రిష.. ఆసియా కప్లోనూ నిలకడైన ప్రదర్శన చేయడమే తన లక్ష్యమని పేర్కొంది.