బెంగళూరు: భారత హాకీ జట్టు జాతీయ శిబిరానికి తెలంగాణ యువ ప్లేయర్ జ్యోతిరెడ్డి ఎంపికైంది. రానున్న ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టోర్నీల కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) సోమవారం 33 మందితో ప్రాబబుల్స్ను ప్రకటించింది.
ఇందు లో సవితా పునియా, వందన కటారియా లాంటి స్టార్ ప్లేయర్లతో పాటు ఇటీవల జాతీయ హాకీ టోర్నీలో రాణించిన మిడ్ఫీల్డర్ జ్యోతి, మరినా లాల్రామ్గ్కీ, మాధురి కిండో, రోప్ని కుమారి, ప్రీతి, దీపిక సోరెంగ్, రుతుజ ప్రాబబుల్స్లో చోటు దక్కించుకున్నారు. వీరంతా మే 16 వరకు జాతీ క్యాంప్లో శిక్షణ పొందుతారు. అటు తర్వాత 22నుంచి మొదలయ్యే ఎఫ్ఐహెచ్ సిరీస్లలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు.