హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ.. జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. సీనియర్ ఇంటర్ స్టేట్ టోర్నీ సెమీఫైనల్లో పరాజయం పాలైన శ్రీజ కాంస్యం ఖాతాలో వేసుకుంది.
ఆదివారం జరిగిన సెమీస్లో శ్రీజ 11-9, 9-11, 11-9, 5-11, 6-11, 9-11 తేడాతో మాంటీ చేతిలో ఓడింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 7-11, 11-8, 11-5, 11-9, 12-10 తేడాతో సయాలి వాణిపై విజయం సాధించింది.