గోవా: నేషనల్ గేమ్స్లో తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక రజత పతకంతో సత్తాచాటింది. గోవా వేదికగా జరుగుతున్న 37వ జాతీయ క్రీడల మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్మిక పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో రష్మిక 5-7, 6-7 (3/7)తో వైదేహీ చౌదరి (గుజరాత్) చేతిలో ఓడింది. ఇప్పటికే మహిళల డబుల్స్లో రజత పతకం సాధించిన రష్మిక.. ఇప్పుడు వ్యక్తిగత విభాగంలోనూ వెండి వెలుగులు విరజిమ్మింది. ఇక టీమ్ విభాగంలో తెలంగాణ మహిళల జట్టు కాంస్య పతకం నెగ్గడంలోనూ రష్మిక కీలక పాత్ర పోషించింది.