న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్కు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన పురుషుల 56కిలోల క్వార్టర్స్ బౌట్లో హుసామ్ 1-4 తేడాతో ప్రపంచ చాంపియన్ మిరాజ్బెక్ మీర్జాహలీలోవ్(కజకిస్థాన్) చేతిలో ఓడాడు. ఆది నుంచే దూకుడు కనబరిచిన కజక్ బాక్సర్ విసిరిన పంచ్లకు హుసామ్ దగ్గర సరైన సమాధానం లేకపోయింది. దీటైన పోటీనిచ్చేందుకు ప్రయత్నించినా టాప్సీడ్ మిరాజ్బెక్ అనుభవం ముందు అక్కరకు రాలేదు. మరోవైపు 64కిలోల క్వార్టర్స్ పోరులో శివ థాపా 5-0తో నాదెర్ ఓద్హ(కువైట్)పై గెలిచి ఐదోసారి ఆసి యా పతకం ఖాయం చేసుకున్నాడు.