Dhriti Koujalgi | హైదరాబాద్, ఆట ప్రతినిధి: నేపాల్ వేదికగా జరుగనున్న ఆసియా ట్రయథ్లాన్ కప్తో పాటు సౌత్ ఏషియన్ చాంపియ్షిప్ టోర్నీకి తెలంగాణ యువ అథ్లెట్ ధ్రితి కౌజాల్జి ఎంపికైంది. ఈనెల 27 నుంచి మొదలయ్యే టోర్నీల్లో భారత్ తరఫున ధ్రితి బరిలోకి దిగనుంది. 2014లో స్విమ్మింగ్ కెరీర్ మొదలుపెట్టిన ధ్రితి..ఆ తర్వాత ట్రై అథ్లెట్(స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్)గా మారి నిలకడగా రాణిస్తున్నది.