భువనేశ్వర్: జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని కాంస్య పతకం కైవసం చేసుకుంది. భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరుగుతున్న ఈ చాంపియన్షిప్ ఆసియా క్రీడలకు అర్హత టోర్నీ కాగా.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో శనివారం నందిని 13.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి (12.92 సె.), నిత్య (13.48 సె.) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు. ఇప్పటికే మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం కైవసం చేసుకున్న జ్యోతికి ఈ టోర్నీలో ఇది రెండో పసిడి పతకం కావడం విశేషం.