హైదరాబాద్, ఆట ప్రతినిధి: తిరువనంతపురం వేదికగా జరుగుతున్న సౌత్జోన్ జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్లు అదరగొట్టారు. బుధవారం జరిగిన బాలికల 4 X 50మీటర్ల ఫ్రీస్టయిల్ రేసును శివానీ కర్రా, దిత్యా చౌదరీ, మేఘనా నాయర్, అన్నికా దెబోరాతో కూడిన రాష్ట్ర జట్టు 2ని:08:98 సెకన్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాలు దక్కించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు బాలికల 50మీటర్ల బెస్ట్స్ట్రోక్ విభాగంలో మిట్టపల్లి రిత్విక 35.91సెకన్ల టైమింగ్తో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. ఇదే టోర్నీలో శివానీ రెండు స్వర్ణాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.