హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ స్విమ్మర్లు సత్తాచాటుతున్నారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే రెండు స్వర్ణాలు నెగ్గిన యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ మూడో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది.
శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రితి 4 నిమిషాల 32.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. మీనాక్షి (4ని. 37.60 సె.; కర్ణాటక), అదితి (4ని.39.58 సె.; మహారాష్ట్ర) వరుసగా రజత కాంస్యాలు గెలుచుకున్నారు. మరోవైపు మహిళల 100 మీటర్ల బెస్ట్స్ట్రోక్లో తెలంగాణకు చెందిన శ్రీనిత్య సాగి కాంస్య పతకం కైవసం చేసుకుంది.