హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఒడిషాలో జరిగిన 52వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ శ్రీ నిత్య సాగి స్వర్ణంతో సత్తాచాటింది. మహిళల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్ ఫైనల్లో నిత్య.. 2 నిమిషాల 24.59 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి పసిడిని గెలుచుకుంది. ఈ పోటీల్లో కర్నాటక స్విమ్మర్లు ప్రియాన్షి (2:29.13), మీనాక్షి (2:31.99) వరుసగా రజత, కాంస్యాలు సాధించారు. పురుషుల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్లోనూ తెలంగాణ కుర్రాడు సుహాస్ ప్రీతమ్ మైలారి (2 నిమిషాల 6.62 సెకన్లు) కాంస్యం నెగ్గాడు.