హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నుంచి తెలంగాణ సీనియర్ చాంపియన్షిప్ మొదలైంది. కన్హా శాంతివనం వేదికగా జరుగనున్న టోర్నీని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దేశంలో బ్యాడ్మింటన్ పట్ల ఆసక్తి అంతకంతకు పెరుగుతున్నది.
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్షిప్ లాంటి టోర్నీల్లో మన ప్లేయర్లు పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయం. యువ ప్లేయర్లను రాష్ట్ర ప్రభుత్వం వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, రంగారెడ్డి బ్యాడ్మింటన్ సంఘం వైస్చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు, కార్యదర్శి యూవీఎన్ బాబు, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.