హైదరాబాద్: ముంబైలో జరిగిన ఆసియా గేమ్స్ ట్రయల్స్లో తెలంగాణ యువ సెయిలర్ ప్రీతి కొంగర పసిడి పతకంతో మెరిసింది. ఇండియన్ నేవీకి చెందిన సుదాంశు శేఖర్తో కలిసి బరిలోకి దిగిన ప్రీతి..470 మిక్స్డ్ క్లాస్ విభాగంలో 20 పాయింట్లతో టాప్లో నిలిచి స్వర్ణాన్ని ఒడిసిపట్టుకుంది.
ఉమా చౌహాన్, ఆర్కే శర్మ ద్వయానికి రజతం, రమ్య సరవణన్, సీహెచ్ఎస్ రెడ్డి జోడీకి కాంస్య పతకం దక్కింది. పదేండ్ల వయసులో సెయిలింగ్ను కెరీర్గా ఎంచుకున్న ప్రీతి అండర్-15 విభాగంలో జాతీయ టైటిల్తో పాటు ఆసియాగేమ్స్ ట్రయల్స్లో పసిడి సొంతం చేసుకుని సత్తాచాటింది.