హైదరాబాద్, ఆట ప్రతినిధి: ముంబై వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ తొలి సెలెక్షన్ ట్రయల్స్లో రాష్ర్టానికి చెందిన ప్రీతి కొంగర పసిడి పతకంతో మెరిసింది. 470 మిక్స్డ్ క్లాస్ ఈవెంట్లో సుదాంశు శేఖర్తో కలిసి బరిలోకి దిగిన ప్రీతి మొత్తం 12 రేసులకు ఆరు రేసుల్లో విజయం సాధించింది. శ్రద్ధ వర్మ, రవీంద్ర శర్మతో జరిగిన తుది పోరులో ప్రీతి, శేఖర్ జోడీ ఆరు పాయింట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ధరణి లావేటి, అక్షయ్ ద్వయం కాంస్య పతకం సొంతం చేసుకుంది. జాతీయ సీనియర్స్లో తెలంగాణకు రెండు పతకాలు లభించడం ఇది తొలిసారి.