నిహార్కు రజతం, మాయావతి, అనికేత్, వ్రితికి కాంస్యాలు
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్లు పతక జోరు కొనసాగిస్తున్నారు. గురువారం జరిగిన వేర్వేరు విభాగపు పోటీల్లో రాష్ర్టానికి నాలుగు పతకాలు దక్కాయి. బాలుర స్విమ్మింగ్ 400మీటర్ల ఫ్రీైస్టెల్ కేటగిరీలో సాయి నిహార్ రజత పతకంతో మెరిశాడు. బాలికల 400మీటర్ల ఫ్రీైస్టెల్ విభాగంలో యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ 4: 32:19 సెకన్ల టైమింగ్తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది.
ఇప్పటికే 800మీటర్ల విభాగంలో ఖేలో ఇండియా కొత్త రికార్డుతో వ్రితి పసిడి పతకం కొల్లగొట్టింది. బాలికల అథ్లెటిక్స్ 200మీటర్ల రేసులో ఎస్సీ గురుకుల విద్యార్థి మాయావతి కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. ఖేలో ఇండియా యూత్గేమ్స్లో మాయావతికి ఇది రెండో కాంస్య పతకం. బాలుర 200మీటర్ల రేసులో రాష్ట్ర యువ అథ్లెట్ అనికేత్ చౌదరి మూడో స్థానంతో కంచు ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్గా ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ.. స్వర్ణం సహా మూడు రజతాలు, ఆరు కాంస్యాలతో కొనసాగుతున్నది.