హైదరాబాద్, సెప్టెంబర్21(నమస్తే తెలంగాణ): ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నీలో తెలంగాణ సచివాలయ ఉద్యోగులు వరుస విజయాలతో అదరగొట్టారు. హర్యానాలోని కురుక్షేత్ర ద్రోణాచార్య స్టేడియంలో మంగళవారం తొలుత జరిగిన మ్యాచ్లో తెలంగాణ 25-21, 25-22 తేడాతో చత్తీస్గఢ్పై విజయం సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ రెండో మ్యాచ్లో ఉత్తరప్రదేశ్పై 25-19, 25-17తో తెలంగాణ విజయదుందుభి మోగించింది. మరోవైపు టోర్నీలో తొలిసారి పోటీపడ్డ ఏపీ మహిళల టీమ్ 2-1తేడాతో ఆర్ఎస్బీపై గెలిచింది. ఈ టోర్నీలో ఉద్యోగులు పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని జీఏడీ ఏఎస్వో చిట్టిబాబు పేర్కొన్నారు.