హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఒడిశా వేదికగా జరుగుతున్న 76వ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్(సంతోష్ ట్రోఫీ)లో తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో తెలంగాణ 5-1 తేడాతో పుదుచ్చేరిపై ఘన విజయం సాధించింది.
ఆది నుంచి తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన రాష్ట్రం తరఫున రసిఖ్ అహ్మద్(1ని, 3ని, 15ని, 25ని) నాలుగు గోల్స్తో విజృంభించగా, యూసుఫ్ (79ని) మరో గోల్ చేశాడు. అస్లాం(70ని) పుదుచ్చేరికి ఏకైక గోల్ అందించాడు.