చెన్నై: తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్లసన్పై అద్వితీయ విజయం సాధించాడు. ఎయిమ్ చెస్ ర్యాపిడ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఏడో రౌండ్ పోరులో 19 ఏండ్ల అర్జున్.. కార్ల్సన్ను 54 ఎత్తుల్లో చిత్తుచేశాడు. గత నెలలో జులియస్ బీర్ జనరేషన్ కప్ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడిన ఈ తెలంగాణ యువ కెరటం.. ఇప్పుడు దానికి బదులు తీర్చుకున్నాడు.
తొమ్మిది రౌండ్ల పాటు సాగే ఈ టోర్నీలో అర్జున్ ప్రస్తుతం 15 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అర్జున్ వరుసగా నీల్స్ గ్రాండీలస్ (స్వీడన్), డానియల్ (యూఎస్ఏ), కార్ల్సన్ (నార్వే)పై విజయాలు సాధించడం విశేషం. భారత్కే చెందిన గుకేశ్ 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు.